Mahanadu | ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్‌ కు చంద్రబాబు పిలుపు

కడప : ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్‌, పాజిటివ్ పాలిటిక్స్, ప్రోగ్రసివ్ పాలిటిక్స్‌కు నాంది పలుకుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలువునిచ్చారు.

కడపలో టీడీపీ మహానాడు ముగింపురోజు ఆయన కీలక ఉపన్యాసం చేశారు. టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు సమాజానికి అంతకంటే ప్రమాదకరమని, వారిని రాష్ట్రం నుంచి తరమికొడదామన్నారు. భారతదేశం టెర్రిస్టులపై ఆపరేషన్ సింధూర్ చేసినట్లుగానే… ఆర్ధిక ఉగ్రవాదులను ‘ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్’తో రాజకీయల్లో లేకుండా చేద్దామన్నారు.

పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీగా.. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీగా చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు… టీడీపీ కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితంగానే ఈ ప్రజాపాలన వచ్చిందన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు..దేవుని గడపలో జరిగింది. రెస్సాన్స్ అదిరిందని, సూపర్ హిట్ అయ్యిందని చంద్రబాబు తెలిపారు.గత ఏడాది మే 2వ తేదీన ప్రజాగళం ఎన్నికల సభ కోసం కడపకు వచ్చానని, ఆ రోజు సభలో కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పానని, అది ఇవాళ అక్షరాలా నిజమైందన్నారు.

అభివృద్ది-సంక్షేమం-సంపద సృష్టి నిరంతరం చేస్తూ, మెరుగైన జీవన ప్రమాణాలు అందించే విధానంతో అడుగులు వేస్తున్నామన్నాకు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు.గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు, భూ మాఫియాలకు ప్రజలు అల్లాడిపోయారని, తన రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. పేదలను దోచుకునేందుకు 22 Aను అస్త్రంగా చేసుకున్నారని, ఆస్తులను వివాదాల్లోకి నెట్టారని గుర్తుచేశారు.

అధికారంలోకి రాగానే ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని, కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని తెలిపారు. రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఢిల్లీలో పరపతి పెరిగిందని, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామని, 2027 డిసెంబర్ లోగా పోలవరం పూర్తిచేసే బాధ్యత తనదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ సెంటిమెంట్ కాపాడామని, రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా చూశామని తెలిపారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం సహకరించిందన్నారు.

ఇంటింటికీ నీళ్లు అందించాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు.యువశక్తికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని తాను బలంగా నమ్ముతానని చంద్రబాబు తెలిపారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పామన్నారు. దాని కోసమే కష్టపడుతున్నానన్నారు. రూ. 7 లక్షల 50 వేల కోట్ల 6 లక్షలమందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయని, మీ రాష్ట్రంలో భూతం ఉంది. రావాలంటే భయమేస్తోందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారని, ఆ భూతాన్ని భూ స్థాపితం చేస్తున్నామని భరోసా ఇచ్చానన్నారు. నూతనంగా తీసుకువచ్చిన 20కు పైగా పాలసీలతో ఫలితాలు వస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *