Jivandhan | మ‌ర‌ణించినా ‘రమణ’ చిరంజీవే… అవ‌యువ‌దానంతో ఆరుగురికి కొత్త జీవితం

వ‌ర్ద‌న్న‌పేట – తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసాడు ఓ యువకుడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రమణ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో రమణ అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. రమణ కళ్ళు, కిడ్నీలు, గుండె దానం చేసి ఆరుగురి ప్రాణాలను నిలబెట్టారు. ఈ వివ‌రాల‌ను తెలంగాన జీవ‌న్ ధాన్ సంస్థ వెల్ల‌డించింది. ఇక . వ కుమారుడు మ‌ర‌ణించినా అవ‌యువ‌దానంతో చిరంజీవిని చేసిన ర‌మ‌ణ‌ కుటుంబ సభ్యులపై ప్రసంశలు కురిపిస్తున్నారు

Leave a Reply