లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ ఐదవ రోజు ఉదయం సెషన్ ముగిసింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 30 ఓవర్లలో 117 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ విజయానికి ఇంకా.. 254 పరుగులు అవసరం ఉండగా ప్రస్తుతం ఓపెనర్లు జాక్ క్రాలీ (42 నాటౌట్) – బెన్ డకెట్ (64 నాటౌట్) చక్కటి బ్యాటింగ్తో భారత్పై ఒత్తిడి తెస్తున్నారు.
డకెట్ ఆకర్షణీయమైన షాట్లు ఆడుతూ వేగంగా స్కోర్ పెంచగా, క్రాలీ సహనంతో నేచురల్ గేమ్ ఆడుతూ ఇన్నింగ్స్ను స్థిరంగా నడిపించాడు. వీరిద్దరూ కలిసే ఓపెనింగ్ వికెట్ కు 117 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ఇంకా ఒక్క వికెట్ కూడా దక్కని భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు. పిచ్లో కొంత టర్న్, బౌన్స్ కనిపించినా స్పిన్నర్లు ఆశించిన ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక మధ్యాహ్న సెషన్ భారత జట్టుకు అత్యంత కీలకంగా మారనుంది. ఒకవైపు ఇంగ్లాండ్ గెలుపు దిశగా దూసుకుపోతుండగా.. మరోవైపు భారత్ ఓ బ్రేక్థ్రూ కోసం ఎదురుచూస్తోంది.