ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) 2025–27 సైకిల్కు సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసింది. టెస్టు క్రికెట్కు మరింత ప్రతిష్టను తీసుకురావాలన్న ఉద్దేశంతో ICC ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఇప్పటివరకు మూడు ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక 2025 జూన్ 17న శ్రీలంక – బాంగ్లాదేశ్ మధ్య గాలెలో ప్రారంభ మ్యాచ్తో డబ్ల్యూటీసీ నాల్గవ ఎడిషన్ మొదలవుతోంది. ముగింపు మ్యాచ్గా జూన్ 2027లో లార్డ్స్ స్టేడియంలో ఫైనల్ జరుగనుంది.
పోటీ ఫార్మాట్ & గణాంకాలు
ఈ సీజన్లో మొత్తం 9 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు 6 టెస్ట్ సిరీస్లు ఆడుతుంది — మూడు స్వదేశంలో, మూడు విదేశాల్లో. మొత్తం 27 సిరీస్లుగా 71 టెస్ట్ మ్యాచ్లు జరుగనున్నాయి. అయితే, వరుసగా రెండుసార్లు ఫైనల్కు చేరిన భారత్, ఈసారి టైటిల్ గెలిచే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
భారత్ షెడ్యూల్ వివరాలు
భారత్ తన ప్రయాణాన్ని ఇంగ్లాండ్లో 5 టెస్ట్ల సిరీస్తో ప్రారంభిస్తుంది. ఈ సిరీస్ జూన్ 20, 2025న హెడ్డింగ్లీలో మొదలవుతుంది.
భారత్ విదేశీ సిరీస్లు:
ఇంగ్లాండ్ – 5 టెస్టులు
న్యూజిలాండ్ – 2 టెస్టులు
శ్రీలంక – 2 టెస్టులు
టీమిండియా హోం గ్రౌంద్ సిరీస్లు:
వెస్ట్ ఇండీస్ – 2 టెస్టులు
దక్షిణాఫ్రికా – 2 టెస్టులు
ఆస్ట్రేలియా – 5 టెస్టులు (2027 బార్డర్-గవాస్కర్ ట్రోఫీ)
లార్డ్స్లో క్లైమాక్స్ !
లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు 2027 జూన్లో లార్డ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి.
ఈసారి షెడ్యూల్ ప్రకారం, భారీ స్థాయిలో మ్యాచ్లు, ఆసక్తికర సిరీస్లు జరగనున్నాయి. ప్రత్యేకంగా భారత్కు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో కీలక సిరీస్లు ఉండడంతో, అభిమానులకు థ్రిల్లింగ్ టెస్ట్ క్రికెట్ అనుభవం ఖాయం.