ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే చోదిమెళ్ల వద్ద సిమెంటు లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరోకరి మరణించారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతి వేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారధి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి పార్థసారథి.ప్రమాద సంఘటనపై వివరాలను జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. . ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఫోన్ ద్వారా ఆసుపత్రి అధికారులకు ఆదేశించారు .