స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్…

స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్…

శ్రీశైలం, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి(Bhramarambika Mallikarjuna Swami) దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం గంగాధర మండపం వద్ద జరగనున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి స్వయంగా హాజరై భక్తుల భద్రత, బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గుడి పరిసర ప్రాంతాలు, గంగాధర మండపం, క్యూలైన్లు(Gangadhara Mandapam, Culines), నంది మండపం తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ జ్వాలాతోరణం కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని ముఖ్యమైన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

భక్తులకు పోలీసు వారి హెచ్చరికలను సూచనలను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply