చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై దాడి..

హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉండగా కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించి…. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు.

రంగరాజన్ నిరాకరించడంతో అతనిపై దాడి చేశారు. తండ్రిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుడిని కూడా దుండగులు గాయపరిచారు.

ఈ దాడిపై రంగరాజన్‌, చిలుకూరు ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *