దేవ‌ర‌కొండ‌లో బీఆర్ఎస్ స‌మావేశం

దేవ‌ర‌కొండ‌లో బీఆర్ఎస్ స‌మావేశం

దేవరకొండ, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ(Congress party)కి ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెప్పాల‌ని న‌ల్ల‌గొండ జిల్లా బీఆర్ఎస్(BRS) అధ్య‌క్షుడు, దేవ‌ర‌కొండ మాజీ ఎమ్మెల్యే ర‌మావ‌త్ ర‌వీంద్ర కుమార్(Ramawat Ravindra Kumar) అన్నారు. ఈ రోజు దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయ‌న‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశార‌ని అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు వడితే రమేష్ నాయక్(Vadithe Ramesh Naik), నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిలియా నాయక్, కంకణాల వెంకట్ రెడ్డి, వల్లపు రెడ్డి లోకసాని తిరుపతయ్య, రాజినేని వెంకటేశ్వరరావు, పార్టీల నాయకులు, బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply