పల్ల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్ (Visakha express ) రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి (Robbery ) ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు(Railway Police ) గాల్లోకి కాల్పులు (firing ) జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్, (Bihar) మహారాష్ట్రకు (Maharastra )_ చెందిన గ్యాంగ్లుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు (Tummala cheruvu ) వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది.
అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు.