కడప వేదికగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వాహణకు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.
బాధ్యతలు అప్పగించిన నేతలు వీరే..
ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు, బక్కనీ నరసింహులు
సమన్వయ కమిటీ కన్వీనర్గా నారా లోకేష్
తీర్మానాల కమిటీ కన్వీనర్గా యనమల రామకృష్ణుడు
వసతి ఏర్పాట్లు కన్వీనర్గా కింజరాపు అచ్చెన్నానాయుడు
సభా నిర్వహణ కమిటీ కన్వీనర్గా కింజరాపు రామ్మోహన్ నాయుడు
భోజనాలు కమిటీ కన్వీనర్గా బీసీ జనార్దన్ రెడ్డి
మీడియా కమిటీ కన్వీనర్గా ఫరూక్
ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్గా అనగాని సత్యప్రసాద్
సాంస్కృతిక శాఖ కార్యక్రమాల కమిటీ కన్వీనర్గా కొండపల్లి శ్రీనివాస్
ఫొటో ప్రదర్శన కమిటీ కన్వీనర్గా ఆనం రామనారాయణ రెడ్డి
ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్గా చింతకాయల విజయ్
సభా ప్రాంగణ పరిరక్షణ కమిటీ కన్వీనర్గా నిమ్మల రామానాయుడు
అలంకరణ కమిటీ కన్వీనర్గా పులివర్తి నాని
రవాణా కమిటీ కన్వీనర్గా పొంగూరు నారాయణ
వాహన పార్కింగ్ కన్వీనర్గా మంతెన రామరాజు
మెడికల్ క్యాంప్ కన్వీనర్గా డోలా బాల వీరాంజనేయ స్వామి
వలంటీర్ల నిర్వహణ కమిటీ కన్వీనర్గా కొల్లు రవీంద్ర
జన సమీకరణ కమిటీ కన్వీనర్గా గొట్టిపాటి రవికుమార్
సుందరీకరణ, పరిశుభ్రత కమిటీ కన్వీనర్గా వాసంశెట్టి సుభాష్