వెలగపూడి – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారత క్రీడా చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం ముగిసినట్లేనని పేర్కొన్నారు. కోహ్లీ క్రీడాస్ఫూర్తి, అంకితభావం, నాయకత్వ లక్షణాలు ఎనలేనివని కొనియాడారు. “విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం భారత క్రీడారంగంలో ఒక గొప్ప అధ్యాయానికి ముగింపు పలికింది. అతడి అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, జట్టును నడిపించిన తీరు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయి” అని పేర్కొన్నారు. కోహ్లీ తన ఆటతీరుతో దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడని, గర్వకారణంగా నిలిచాడని చంద్రబాబు ప్రశంసించారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కోహ్లీ, ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్గా, బ్యాట్స్మన్గా భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తుచేశారు. అతడి దృఢ సంకల్పం, దూకుడు యువ క్రీడాకారులకు ఆదర్శప్రాయమని తెలిపారు. “విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రస్థానంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడికి నా శుభాకాంక్షలు,” అంటూ చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.