బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్కు అస్వస్థత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (VHanumanthaRao) (వీహెచ్) ర్యాలీ నడుస్తూ తూలి పడ్డారు. రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్లో బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ లో పాల్గొంటోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుతోపాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender), డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి అంబర్ పేట్లో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వీహెచ్ నడుస్తూ ఒక్కసారిగా తూలి పడ్డారు. వెంటనే పక్కన ఉన్న నేతలు ఆయనను పైకి లేపారు. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అస్వస్థతకు గురై తూలి పడి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

