TG | పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తా – పసుపు బోర్డు సెక్రెటరీ భవానీ

నిజామాబాద్ ప్రతినిధి : (ఆంధ్రప్రభ)పసుపు రైతుల సంక్షే మానికి కృషి చేస్తాననిజాతీయ పసుపు బోర్డు సెక్రటరీ భవాని (ఐఏఎస్) అన్నారు. సోమవారం నిజామాబాద్ లోని జాతీ య పసుపు బోర్డు కార్యా లయంలో పసుపు బోర్డు సెక్రటరీ భవాని (ఐఏఎస్) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అం దించారు.

బాధ్యతలు తీసుకున్న వెంటనే జక్రాన్ పల్లి మండలంలోని మనో హరాబాద్ లో గల జేఎంకే పిఎం రైతు సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి తో కలిసి సందర్శిం చారు. రూ.3 కోట్ల వ్య యంతో ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో మండ లంలోని పలు గ్రామాలకు చెందిన 600 కు పైగా రైతులు ఏర్పాటు చేసుకో వడం అభినందనీ యమ న్నారు.

అనంతరం పరిశ్ర మలో తయారు చేసిన పసుపు పౌడర్ ని ఆసక్తి గా పరిశీలించారు. ఇలాం టి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు మేలు కలగ డమే గాక, స్థానిక యువ తకి పెద్ద ఎత్తున ఉద్యో గాలు లభించే ఆస్కారం ఉందన్నారు. అనంతరం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గల పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు.

కేంద్రం ద్వారా రైతులకు అందిస్తు న్న సేవలను శాస్త్రవేత్త మహేందర్ రెడ్డి వివరిం చారు. వీరి వెంట స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *