surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి

surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి

ప్రభుత్వంతో ఎంఓయు
1000 మందికి ఉపాధి
గ్రీన్ ఎనర్జీ రంగంలోకి సురభి గ్రూప్
పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమ

surabhi group| పెద్దపల్లి ఆంధ్రప్రభ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టేందుకు సురభి గ్రూప్స్ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ లో సురభి గ్రూప్ ఎస్ఎల్ఆర్ పవర్ చైర్మన్ సురభి హరేందర్ రావు రాష్ట్రంలో 3 వేల కోట్ల పెట్టుబడి తో పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకున్నారు. సోమవారం హైదరాబాదులో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క కు ఎంఓయు పత్రాలను అందజేశారు.

surabhi group | వెయ్యి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి

surabhi group

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సురభి గ్రూప్స్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి లో 3000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ సెల్, ప్యానెల్ తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్నారన్నారు. ఈ పరిశ్రమ నిర్మాణం వల్ల వెయ్యి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. ఏడాది కాలంలో పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సురభి గ్రూప్స్ చైర్మన్ హరిందర్ రావును అభినందించారు.

click here to read Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం

clickhere toread more

Leave a Reply