Suicide | తల్లితో గొడవ పడి…

Suicide | తల్లితో గొడవ పడి…

చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి లోనై

Suicide | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : పెంపుడు జంతువులపై అధిక మమకారం కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది. చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి లోనై యువతులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్పటికే మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎస్సీ చదువుతున్న హిమబిందు (20) అనే యువతి, ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లి చనిపోవడంతో తీవ్రంగా బాధపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

Suicide |
Suicide |

ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్‌లోని అల్వాల్‌లో మరో విషాదం వెలుగుచూసింది. ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ఠ, పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని తల్లి చెప్పడంతో గొడవపడింది. ఈ వివాదంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఒక చిన్న విషయంపై తల్లితో వాగ్వాదం జరిగి ప్రాణాలు తీసుకోవడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. పెంపుడు జంతువులపై మమకారం హద్దులు దాటితే ఇలాంటి విషాదాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CLICK HERE TO READ MORE : SI Chandrasekhar | మొన్న భార్య… నేడు భర్త

CLICK HERE TO READ MORE :

Leave a Reply