కత్తితో పొడిచి చంపింది
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తాగుడుకు బానిసై (addicted to alcohol) గత కొంతకాలంగా వేధిస్తున్నాడని.. ఆ బాధ భరించలేక భర్తపై కూరగాయల కత్తితో దాడి చేసి హత్య చేసింది భార్య. ఈ దారుణం నార్సింగ్ పోలీస్ స్టేషన్ (Narsingh Police Station) పరిధిలోని కోకాపేట్ (Kokapet)లో చోటుచేసుకుంది. అస్సాం(Assam)కు చెందిన కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా భార్యాభర్తలు. ఉపాధి కోసం హైదరాబాద్ (Hyderabad) వలస వచ్చారు. కోకాపేట్లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్ణ జ్యోతి భర్తపై కూరగాయల కత్తితో విచక్షణరహితంగా పొడిచింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భరత్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరత్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కృష్ణ జ్యోతిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.