ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు బ్రేక్ పడింది. ఎస్ఆర్హెచ్ నిర్ధేశించిన భారీ పరుగుల ఛేదనలో చెలరేగి ఆడుతున్న సంజు (66) – ధ్రువ్ (70) పెవిలియన్ కు చేరారు.
13.6వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్ లో సంజు శాంసన్ ఔటవ్వగా.. ఆ తరువాతి ఓవర్ 14.2 లో ఆడమ్ జంపా బౌలింగ్ లో ధృవ్ జురెల్ ఔటయ్యాడు.
దీంతో ఆర్ఆర్ జట్టు 14.2 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. ఇక ప్రస్తుతం క్రీజులో షిమ్రాన్ హెట్మెయర్ – శుభం దుబే ఉన్నారు.