హరీశ్రావు సభలో పుష్ప సినిమా డైలాగ్తో ప్లకార్డులు వైరల్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) పాపులర్ డైలాగ్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (Jagan) పర్యటనలో ‘రప్పా రప్పా నరుకుతాం’ అనే పుష్ప మూవీ పాపులర్ డైలాగ్ ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించడం చర్చానీయాంశంగా మారింది.
‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ! పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీలను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
ఇప్పుడు తెలంగాణలో…
ఏపీలో వివాదంగా మారిన ఈ డైలాగ్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి కూడా పాకింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) సభలో రప్పా రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి. తాజాగా పటాన్చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో “2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.