Protest – కేంద్ర బడ్జెట్లో వివక్ష – రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపు
హైదరాబాద్ – కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. నేటి నుంచి రెండు రోజులపాటు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈనెల 2న టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్బండ్ డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 3 నాడు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు , డిసీసీలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగం తో పాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలి అని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.