ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈరోజు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కీలక పోరులో ముంబై ఇండియన్స్ తో తలపడిన శ్రేయస్ సేన.. 7 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుచేసింది.
ఈ విజయంతో పంజాబ్ జట్టు 19 పాయింట్లతో టేబుల్ టాపర్ గా స్థానం సంపాదించగా.. ప్లేఆఫ్స్లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ కు అర్హత సాధించింది. మరోవైపు, ముంబై జట్టుకు ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ధేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని.. పంజాబ్ నిర్దేశించిన 9 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 62) అద్భుతంగా ఆడి అర్ధశతకంతో జట్టుకు శుభారంభం అందించాడు. అతనికి తోడుగా జోష్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73) ధాటిగా ఆడి విజయాన్ని సులభం చేశాడు.
ప్రభ్ సిమ్రాన్ సింగ్ (16 బంతుల్లో 13) కొన్ని కీలక షాట్లు ఆడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (14 బంతుల్లో 20) అవసరమైన వేగాన్ని జట్టుకు అందించాడు. మొత్తంగా, పంజాబ్ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో జట్టు విజయాన్ని గెలుచుకుంది.
ఈ విజయం పంజాబ్ ప్లేఆఫ్స్లో అగ్రస్థానానికి చేరుకోగా.. ముంబై అదనపు ఒత్తిడిలో పడింది. ఇప్పుడు ముంబై ప్రయాణం ఎలిమినేటర్ మ్యాచ్పై ఆధారపడి ఉంటుంది.