చత్తీస్ గర్ – కర్రేగుట్టలు నక్సల్స్ రహితంగా మారాయని పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులను హతమార్చగా ఇందులో 16 మంది మహిళలున్నట్లు తెలిపారు. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేయగా మృతులపై 1.72 కోట్ల రివార్డులున్నట్లు వెల్లడించారు.
కూంబింగ్ ఆగదు..
కర్రెగుట్టలతోపాటు పరిసర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని సీఆర్ పీఎఫ్ డీజీ జ్నానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.నేడు ఆయన చత్తీస్ గర్ పోలీస్ డిజి అరుణ్ దేవ్ గౌతమ్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ, . కర్రేగుట్ట కొండలు ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారినట్లు చెప్పారు. ఇప్పటివరకు31 మంది నక్సల్స్ హతమవగా.. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేశామన్నారు.
‘2026లో దేశం నక్సల్స్ నుండి విముక్తి పొందుతుంది. తెలంగాణ నక్సల్స్ కమిటీని లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సిఆర్ ఎఫ్ పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. వ్యూహాం ప్రకారం ఆపరేషన్ నిర్వహించాం. ఏప్రిల్ 21 నుండి మే 11 వరకు ఆపరేషన్ కొనసాగింది. 18 మంది జవాన్లు గాయపడగా ఇప్పుడు వారంతా సురక్షితంగా ఉన్నారు. ఇక చనిపోయిన 31 మంది నక్సల్స్లో 16 మంది మహిళలున్నారు. ఇప్పటివరకు 28 మంది నక్సల్స్ మృతదేహాలను గుర్తించగా మరణించిన నక్సల్స్పై మొత్తం 1.72 కోట్ల రివార్డులన్నాయి’ అని చెప్పారు.
ఇక భారీగా తుపాకులు, ఇతరత్రా సమాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీరు బాటిళ్లలో 450 ఐఇడీలను గుర్తించి ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు దేశంలో కేవలం 6 జిల్లాలు మాత్రమే నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉందని, మిగతా ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీని నామరూపాల్లేకుండా చేసినట్లు తెలిపారు.