ఆసుపత్రికి తరలిస్తుండగా అనంత లోకాలకు
నిజాంపేట, ఆంధ్రప్రభ : ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య(suicide) చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా(Medak District), నిజాంపేట మండల కేంద్రంలో ఈ రోజు సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేటకు చెందిన విభూది జ్యోతి(Vibhudi Jyoti) (35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇది గమనించిన ఆమె భర్త నర్సింలు(Narsimlu) 108కు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఇట్టి సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

