వారంతా కాంగ్రెస్ యువనేతలే?
గుర్తించిన విచారణ కమిటీ
ఆ ఇద్దరు సీఎం రేవంత్కు సన్నిహితులు
అందుకే గుట్టుగా వివరాలు దాచిపెట్టారు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
హైదరాబాద్ వేదికగా ప్రపంచ అందగత్తెల పోటీ జరుగుతుంది. ఈ క్రమంలో తనను వ్యభిచారిణిగా చూశారని మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపించిన సంగతి విదితమే. ఈ ఆరోపణలపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను విచారణ కమిటీ గుర్తించింది. అయితే వారిద్దరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులు కావడంతో బయటకు వివరాలు తెలియడం లేదని సమాచారం.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు
మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీతో మిస్ బిహేవ్ చేసిన ఇద్దరిని విచారణ కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఆమెతో వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించినట్టు దర్యాప్తు అధికారులకు చిక్కిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అధికారులు గుర్తించారు. చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఆ నాయకులు కూర్చున్నట్లు సీసీటీవీ ఆధారంగా కమిటీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి విచారణ కమిటీ సమర్పించింది