మక్తల్, జూన్ 9 (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని రాష్ట్ర మంత్రి మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇవాళ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా శాలువాతో ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించి (honor) కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. మంత్రివర్గంలో తనకు అవకాశం ఇచ్చినందుకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు (Thanks) తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి సతీమణి లలితతో పాటు కుమారులున్నారు.