ముంబయి | ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్బై లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్స్ చెలరేగి పోయారు.
నిర్ధారిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. ముంబై గెలవాలంటే 222 పరుగులు చేయాల్సి ఉంది.
ఓపెనర్ సాల్ట్ నాలుగు పరుగులకు ఔట్ . కోహ్లి, పడిక్కళ్ లు ముంబై బౌలర్ల పై విరుచుకు పడ్డారు. పవర్ ప్లే లో ఈ ఇద్దరూ కలిసి 69 పరుగులు చేశారు. అనంతరం. దూకుడుగా ఆడుతున్న పద్దిక్కల్ ను విఘ్నేష్ ఔట్ చేశాడు. పద్దిక్కల్ 37 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ దశలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 67, రజత్ పటే దార్ 64, లివింగ్స్టన్ సున్నా పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. జితేష్ శర్మ 40, టీమ్ డేవిడ్ ఒక్క పరుగుతో నాటౌట్ గా ఉన్నారు.
ముంబాయి బౌలర్ లో బోల్ట్, హార్దిక్ లకు రెండేసి వికెట్లు లభించగా విగ్నెస్ ఒక వికెట్ తీసుకున్నాడు. నేడు బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ పడగొట్ట కుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు