Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 38మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవి ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం. మూడు రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దళాలు మోహరించి కూంబింగ్ నిర్వహించారు. శనివారం జరిగిన దాడిలో దాదాపు 28 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సుంది.

Leave a Reply