మహబూబాబాద్, నర్సింహులపేట, మార్చి25(ఆంధ్రప్రభ) : ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వంతడపల గ్రామంలో ఇవాళ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వంతడపల గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీను గత కొంతకాలంగా జీవనం కోసం భార్య పిల్లలతో హైదారాబాద్ లో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
సోమవారం రాత్రి గ్రామంలోని ఇంటికి ఒక్కడే వచ్చి బస చేశాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో వారి బందువులు తలుపులు తెరిచి చూడగా, ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియ రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.