Makthal | గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌గా గెలిపించండి

Makthal | గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌గా గెలిపించండి

  • సేవకుడిగా ప్రజల కోసం పని చేస్తా
  • కాంగ్రెస్ బలపరిచిన మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ గౌడ్

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మంథన్ గోడ్ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా బరిలో నిలిచిన రాజేందర్ గౌడ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన తన మద్దతు ధరలతో గ్రామంలోని వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తాను సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టే పనులను వివరించారు.

మంత్రి వాకిటి శ్రీహరి అండతో మంథన్ గోడ్ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మంథన్ గోడ్ గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయ‌ని, గ్రామంలోని ప్రతి వ్యక్తి రాజకీయాలు పక్కనపెట్టి గ్రామాభివృద్ధి కోసం తనను సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరితో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మంథన్ గోడ్ గ్రామ రూపురేఖలు మారుస్తామన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ప్రజలకు వివరించారు. సర్పంచ్ గా ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాల్సిందిగా గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి కె.రాజేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కె. కృష్ణయ్య గౌడ్, గోపాల్ గౌడ్, బుగ్గప్ప, రంజిత్, నరేష్, ఆంజనేయులు, షఫీ, నవనీత, వెంకటమ్మ, రాధ, అర్చన, రంజిత్, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply