హైదరాబాద్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంత మంది యువకులు పిచ్చి చేష్టలతో రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే స్టంట్స్ రీల్స్ చేసిన కొంత మంది యువత ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చుతున్న సంఘటనలు కోకొల్లాలు. ఓ యువకుడు రైల్వే ట్రాక్పై ప్రమాదకర సంస్ట్కు నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఆదివారం ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు.
వెర్రి చేష్టలంటే ఇదే!వీడియోలో ఓ యువకుడు రైలు వెళ్తుండగా ట్రాక్ మధ్యలో నిలువుగా పడుకున్నాడు. కొంత సమయం తర్వాత ట్రైన్ యువకుడిపై నుంచి వెళ్లిపోయాక లేచి నిలబడి ఏదో సాధించినట్లుగా విజయ సంకేతం ఇస్తాడు.
దీనిపై వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ‘ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి’ అని పేర్కొన్నారు.