LSG vs PBKS | ల‌క్నోను ఆదుకున్న పూర‌న్, ఆయుష్ బదోని.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే !

లక్నో : ఏకనా క్రికెట్ స్టేడియం వేదిక‌గా పంజాబ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో లక్నో సూప‌ర్ జేయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన ఎల్‌ఎస్‌జి.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు సాధించింది. పూరన్, ఆయుష్ బదోని, స‌మ‌ద్ మాస్ ఇన్నింగ్స్ ఆడి.. పంజాబ్ ముందు డిఫెండబుల్ టార్గెట్ సెట్ చేశారు.

తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన ల‌క్నో ఐదోవ‌ర్ల‌కే కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ జ‌ట్టును.. నికోల‌స్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుష్ బదోని (33 బంతుల్లో 41) ఆదుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి 4వ వికెట్ కు 54 ప‌రుగులు జోడించారు. ఇక పూర‌న్ ఔట‌న త‌రువాత అబ్దుల్ స‌మ‌ద్ (12 బంతుల్లో 27) తో జ‌త‌ట్టిన బ‌దోని 6వ వికెట్ కు 47 ప‌రుగుల భాగ‌స్వామ్యం క్రియేట్ చేశాడు. ఐడెన్ మార్క్రామ్ (28), డేవిడ్ మిల్ల‌ర్ (19) ప‌రువాలేద‌నిపించారు. దీంతో ల‌క్నో స్కోర్ 171 కి చేరింది.

ఇక పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్ల‌తో రాణించాడు. ఇక‌ లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ త‌లా ఒక వికెట్ తీశారు. 172 ప‌రుగుల టార్గెట్ తో శ్ర‌యేస్ అయ్యార్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఛేజింగ్ కు దిగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *