lexfridman Interview | 140 కోట్ల ప్రజలే నా బలం – ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ – చిన్నతనంలో పేదరికంలో పెరిగినప్పటికీ, తాను దాని బరువును ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు ప్రధాని మోడీ. . కష్టాల మధ్య కూడా, తాను ఎప్పుడూ లేమిని అనుభవించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన నేల అని, ఆ కారణంగానే భారతదేశ శాంతి సందేశం ప్రపంచదేశాల్లో ప్రతిధ్వనిస్తోందని అన్నారు

ఆమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రధాని తో 3 గంటల పాటు ఐకానిక్‌ ఇంటర్వ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మోడీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.ముఖ్యంగా తన జీవితంలోని బాల్య అనుభవాలు, పేదరికం, ప్రజా జీవితంలో తన ప్రయాణం, రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్న రోజుల గురించి, హిందూ మతం గొప్పతనం గురించి కూడా వివరించారు.

నాటి విషయాలను ఆయన గుర్తుచేసుకుంటూ.. చిన్న తనంలో తన మామ తనకు తెల్లటి కాన్వాస్ బూట్లు ఎలా బహుమతిగా ఇచ్చాడో, వాటిని స్కూల్లో అరిగిపోయిన చాక్‌పీస్‌తో ఎలా పాలిష్ చేశాడో వంటి విషయాలను పంచుకున్నారు. జీవితంలోని ప్రతి దశను కృతజ్ఞతతో స్వీకరించానని అన్నారు. అలాగే పేదరికాన్ని ఎప్పుడూ పోరాటంగా, బరువుగా చూడలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని చెప్పారు.

140 కోట్ల ప్రజలే నా బలం”

నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల మంది ప్రజలు, కాలానికి నిలిచిన దేశ సంస్కృతి, వారసత్వం నా వెనుక ఉండటమే నా బలం” అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ దేశాధినేతలతో కరచాలనం చేస్తున్నానంటే ఆ కరచాలనం ఘనత మోదీది కాదని, 140 కోట్ల భారతీయులకే ఆ ఘనత చెందుతుందని అన్నారు.సైద్ధాంతిక పునాదులురాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS)తో తన అనుబంధం, అక్కడ నేర్చుకున్న విలువలే తన సైద్ధాంతిక పునాదులని మోడీ స్పష్టం చేశారు.

దేశం కన్నా మిన్న ఏదీ లేదని, సమాజ సేవే దైవ సేవ అని ఆర్ఎస్ఎస్ నుంచి తాను నేర్చుకున్నానని, ఆర్ఎస్ఎస్ తమ సభ్యులందరికీ దేశం పట్ల, ప్రజల పట్ల అలాంటి బలమైన భావాలను పాదుకొల్పుతుందని చెప్పారు. దేశ సేవలో ఆర్ఎస్ఎస్ కంట్రిబ్యూషన్ ఎంతో ఉందని,

విద్యాపరంగా “విద్యాభారతి” పేరుతో దేశవ్యాప్తంగా 70,000 పాఠశాలలు నడుపుతోందని, 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కంటే అతిపెద్ద స్వయంసేవక్ సంఘ్ ప్రపంచంలోనే లేదని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ జర్నీ 100 ఏళ్లకు చేరుకుందని చెప్పారు

.పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై..

ఉగ్రవాదం అనేది ఇండియా సమస్య మాత్రమే కాదని, యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తు్న్న సమస్య అని ప్రధాని మోదీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాన ఉగ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయం కూడా తరచు ముడిపడి కనిపిస్తుందని ఒసామాబిన్ లాడెన్‌ను పాక్‌లో మట్టుబెట్టిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అన్నారు.

టెర్రరిజంతో ఎవ్వరికీ ప్రయోజనం ఉండదని ఇండియా తరచు హెచ్చరిస్తూనే ఉందని, కానీ పాకిస్థాన్ మద్దతు పలుకుతూనే ఉందని అన్నారు. స్టేట్-స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఇతర దేశాలకు హాని చేయడంతో పాటు సొంత ప్రజానీకం, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి స్వదేశంలో ఆశ్రయం ఇవ్వడం, ప్రోత్సహించడం పాక్ మానుకోవాలని హితవు పలికారు. భారత్‌తో పాక్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందని, టెర్రరిజాన్ని ఇండియాకు ఎగుమతి చేస్తోందని తప్పుపట్టారు మోడీ

.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు గౌరవసూచకంగా తాను ఏకంగా 45 గంటలపాటు ఉపవాసం ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్‌మాన్ వెల్లడించాడు. ఆయన కేవలం నీళ్లు మాత్రమే తాగినట్లు తెలిపాడు.

తన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఉపవాసంపై తన దృక్పథాన్ని కూడా పంచుకున్నారు. ఇంద్రియాలను పదును పెట్టడంలో, మానసిక స్పష్టతను పెంచడంలో, క్రమశిక్షణను పెంపొందించడంలో ఉపవాసం పాత్రను నొక్కి చెప్పారు. ఉపవాసం అనేది కేవలం భోజనం మానేయడం మాత్రమేకాదని, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ అని మోడీ అన్నారు. ఉపవాసం సాంప్రదాయ, ఆయుర్వేద పద్ధతులతో లోతుగా అనుసంధానించబడిందని ఆయన వివరించారు. శరీర నిర్విషీకరణకు సహాయపడటానికి ఉపవాసం ముందు తాను బాగా హైడ్రేట్ అవుతానని తెలిపారు. ఉపవాసం తనను మరింత శక్తివంతం చేస్తుందని, బద్దకం వీడి మరింత కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడుతుందని మోడీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *