Kurnool | చిన్నారిపై అత్యాచారం… పరారిలో నిందితుడు ..

కర్నూలు – కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. స్వీట్స్ ఇస్తానని చెప్పి ఒక యువకుడు ఆరేళ్ల చిన్నారి పై గురువారం నాడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. రంగస్వామి అనే యువకుడు ఆరేళ్ల బాలికను మోసం చేసి స్వీట్స్ కొనిస్తానని తీసుకెళ్లి దారుణంగా లైంగిక దాడి చేశాడు. అయితే తల్లి తండ్రులు సరిగ్గా ఆ సమయంలో అక్కడికి రావడంతో అక్కడ జరుగుతున్న బాగోతాన్ని చూసి వారు కేకలు వేయడంతో.. ఆ యువకుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు.

ప్రమాదాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే కౌతాళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రంగస్వామి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై త్వరితగా న్యాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *