డిప్యూటీ రేంజర్ కు మెమో
జన్నారం, మే15 (ఆంధ్రప్రభ): విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు కవ్వాల టైగర్ రిజర్వ్ సీఎఫ్, మంచిర్యాల ఎఫ్డీపీటీ శాంతారాం తెలిపారు. గురువారం స్థానిక అటవీశాఖ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. జన్నారం డిప్యూటి రేంజ్ ఆఫీసరు తిరుపతికి మెమో జారిచేసినట్లు ఆయన చెప్పారు.
అభయారణ్యంలోని జన్నారం అటవీ బీటులోని కొత్తూరుపల్లి గ్రామ సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అడవుల్లో గతంలో గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటున్నారు. గత రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఉన్న 22 మంది గిరిజనులు గుడిసెలను మూకుమ్మడిగా అటవీ అధికారులు దాడులు చేసి తొలగించారు. అయినప్పటికీ మళ్లీ అదే ప్రదేశంలో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారని, తాను బుధవారం సాయంత్రం వచ్చి చూసే వరకు తమ సంబంధిత అటవీ అధికారులు పట్టించుకోలేదని, ఈ మేరకు అటవీ భూములను సంరక్షించడంలో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కు మెమో జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు సస్పెన్షన్, మెమో ఆదేశాలను జన్నారం ఎఫ్డీఓ కార్యాలయం రేంజ్ కు పంపినట్లు ఆయన చెప్పారు.