ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు రసవత్తుపోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు IPL 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI) – గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి.
ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొంటుంది. అక్కడ విజయం సాధిస్తే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్ ఓడిపోయిన జట్టుకు టోర్నమెంట్లో ప్రయాణం ముగుస్తుంది.
టాస్ అప్డేట్..
ఇదిలా ఉండగా, ముల్లన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఈ హై-స్టేక్ మ్యాచ్లో రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులకు ఇది ఒక రసవత్తరమైన పోరాటం కావడం ఖాయం.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాజ్ అంగద్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్.
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
గుజరాత్ టైటాన్స్ (GT):
కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని GT లీగ్ దశను మూడవ స్థానంలో 18 పాయింట్లతో ముగించింది. అయితే, చివరి రెండు మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఈ సీజన్లో సాయి సుదర్శన్ (679 పరుగులు), శుభ్మన్ గిల్ (649 పరుగులు) అత్యుత్తమ ఫార్మ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ (23 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (15 వికెట్లు) కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరోవైపు, గుజరాత్ జట్టుకు మరో సమస్య ఎదురైంది. టాప్ ఆర్డర్లో కీలక పాత్ర పోషిస్తున్న జోస్ బట్లర్… తన దేశీయ డ్యూటీ కోసం వెళ్లిపోయాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్కు జోస్ బట్లర్ అందుబాటులో ఉండడు. అతని స్థానంలో కుశాల్ మెండిస్ బరిలోకి దిగనున్నాడు.
ముంబై ఇండియన్స్ (MI):
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని MI జట్టు ప్రారంభంలో కొంత వెనుకబడినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలతో నాలుగవ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ (640 పరుగులు) ప్రధానంగా నిలుస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తూ.. బ్యాటింగ్ విభాగంపై భారాన్ని తగ్గిస్తున్నారు. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే, ముంబై బౌలింగ్ యూనిట్ గుజరాత్ కంటే బలంగా కనిపిస్తోంది.
మరోవైపు ముంబై జట్టు కూడా ఓ విదేశీ ఆటగాడిని కూడా కోల్పోయింది. ఓపెనర్ రికెల్టన్ (252 పరుగులు) ప్లేఆఫ్స్కు అందుబాటులో ఉండడు. బదులుగా జట్టు జానీ బెయిర్స్టోను ఎంపిక చేసింది.
గత ఫలితాలు…
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ముంబైపై ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచింది. అంతేకాకుండా, ఇప్పటివరకు ప్లేఆఫ్స్కు చేరిన ఇతర మూడు జట్లపై ముంబై ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. సీజన్ మధ్యలో వరుసగా ఆరు మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ, ముంబై తమ చివరి మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓటమి చవిచూసింది.