GUDIVADA | ఘనంగా కార్తీక వన సమారాధన

- కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో గుడివాడలో నిర్వహణ
- ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని, వేనిగండ్ల రాము
GUDIVADA | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. సమారాధనలో కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా తులసి చెట్టు మరియు కార్తీక దామోదరులకు ఎమ్మెల్యే రాము పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే రాముతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన, ఎమ్మెల్యే కామినేని వన సమారాధన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం సంగీయులు కొద్దిసేపు మౌనం పాటించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కామినేని మాట్లాడారు… 70 ఏళ్ల క్రితమే గుడివాడ ఎంతో సుసంపన్నంగా ఉండేదని, గుడివాడ మట్టిలో ఏదో శక్తి ఉండబట్టే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామోజీరావు లాంటి ఎందరో మహానుభావులు ఈ నెలపై జన్మించారన్నారు. సమాజంలోని ప్రతి కులంలో కొందరు చెడ్డవాళ్ళు ఉంటారని, ఒకరిద్దరు చేసే తప్పులను కులాలకు ఆపొదించకూడదని, ప్రతి ఒక్కరు సోదర భావంతో కలిసి ముందుకు సాగితేనే సమాజ ఉన్నతి సాధ్యమవుతుందన్నారు.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… ఆత్మీయతలను చాటేలా వన సమారాధనలు నిర్వహించడం సంతోషకరమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు ఇతర వర్గాలను గౌరవించుకోవాలని, శక్తి కలిగిన వారు పేదలకు సహాయం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.ఎన్నికల వరకే రాజకీయాలని…. గెలిచిన తర్వాత గుడివాడ ప్రజలందరికీ తాను ఎమ్మెల్యే నేనని, గుడివాడ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగితేనే గుడివాడ అయిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. సమారాధనలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేసిన సంఘీయులకు మహాజన సంఘ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు కామినేని, వెనిగండ్ల రాము, ఇతర ప్రముఖులను మహాజన సంఘ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక నిత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు చల్లగుల్ల శోభనాద్రి చౌదరి,చేకూరు జగన్మోహనరావు,లింగం ప్రసాద్, పట్టణ ప్రముఖులు డాక్టర్ పాలడుగు వెంకట్రావు, ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్. వేములపల్లి కోదండరామయ్య, గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్, నిమ్మగడ్డ సత్యసాయి,కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు మన్నెం భవాని శంకర్ , ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు, కార్యదర్శి కంభంపాటి రవి , గౌరవ అధ్యక్షులు వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావు, కోశాధికారి రావి శ్రీనివాస్ చౌదరి, విద్యా కమిటీ చైర్మన్ బాబు శ్రీకర్ , క్వాలిటీ ఫీడ్స్ అధినేత కోగంటి ఆంజనేయులు, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, పలువురు సంఘ పెద్దలు వేలాదిగా, గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన సంఘీయులు పాల్గొన్నారు.
