Collector | కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి..

Collector | కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి..

వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి..
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష


సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: రైతులు (farmers) పండించిన దాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన వడ్ల నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Koya Sri Harsha) అన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలంలోని చిన్న బొంకూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చె సిన ధాన్యాన్ని అదేరోజు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ (Collector) అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల లోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు (farmers) అవసరమైన వసతులు కల్పించాలన్నారు. సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి జాప్యం లేకుండా దిగుమతి అయ్యేలా చూడాలన్నారు. హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కే. శ్రీనాథ్, సంబంధిత అధికారులు ఉన్నారు.

Leave a Reply