Followup – 31కి చేరిన ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బస్తర్‌ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది.

దీంతో ఇంద్రావతీ నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున భద్రతా దళాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు మొదలు కావడంతో భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. ఆ ప్రదేశంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

గత వారం బీజాపుర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని జనవరి 6న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.

Leave a Reply