జైపూర్ : రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని దౌసా జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) చోటుచేసుకుంది. బాపీ సమీపంలో దౌసా-మనోహర్పూర్ (Dausa-Manoharpur) రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ ఒక కంటైనర్ను ఢీకొనడంతో 11మంది అక్కడికక్కడే మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్లోని సవాయి మన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని ఎటావా జిల్లాకు చెందిన భక్తులు ఖాటూష్యామ్జీ దేవాలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ జామ్ (Traffic jam) కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులలో ఏడుగురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.