ELECTION | 134 పంచాయతీల్లో సర్వం సిద్ధం

ELECTION | 134 పంచాయతీల్లో సర్వం సిద్ధం
- ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు :18,
- నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్,
ELECTION | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో 3వ విడతలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా 3వ విడత ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి సంసిద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇవాళ నాగర్ కర్నూల్ ఎన్నికల (Election) అధికారి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాలో చివరి 3వ విడతలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ మాట్లాడుతూ….. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా 3వ విడత ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 3వ విడత ఎన్నికల కోసం 3629 పిఓలు, ఓపిఓలు పాటు వివిధ రకాల బాధ్యతలతో 6 వేల మందికి పైగా ఎన్నికల అధికారులు 3వ విడత ఎన్నికల్లో వివిధ హోదాల్లో విధుల్లో పాల్గొంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 158 గ్రామ పంచాయతీలు ఉండగా, అమ్రాబాద్ మండలంలో 5 గ్రామపంచాయతీలకు, చారకొండ (Dharakonda) మండలంలో ఒక గ్రామ పంచాయతీకి, మొత్తం 6 సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల దాఖలు కాలేదని, 18 గ్రామ పంచాయతీలు సర్పంచలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 134 గ్రామ పంచాయతీలకు గాను 414 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు.
మూడు విడతల ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ (Poling) కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసామని, ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు ముడు విడతలలో శిక్షణ ఇచ్చామన్నారు. సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటివి నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
1364 వార్డులకు గాను, అమ్రాబాద్ లో 40 వార్డులకు, చారకొండ లో 8 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 252 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, ఎన్నికలు జరిగే 1064 వార్డులకు గాను 2707 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఆయా అభ్యర్థులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలియజేశారు. అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, చారకోండ, లింగాల, పదార, ఉప్పునుతల 7 మండలాల్లో 1,064 పోలింగ్ కేంద్రాలకు, 3629 పిఓలు, ఓపిఓలతో (OPO) పాటు 134 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు.
3వ విడతలు జరిగే ఎన్నికల్లో 1,00 249మంది పురుష ఓటర్లు, 1,01,184 మంది మహిళా ఓటర్లు, ఇతరులు నలుగురు, మొత్తం 2,01,437 మంది ఓటర్లు రేపు ఏడు మండలాల్లో జరిగే మూడవ విడత ఎన్నికల్లో ఓటు (Vote) హక్కు వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. చివరి విడతలో జరిగే ఎన్నికలకు 21 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 23 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ప్రక్రియను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో జరిగే చివరి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో (Police) కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ, పోటీచేస్తున్న అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కొనసాగి పోలింగ్ ప్రక్రియలను జిల్లా కలెక్టరేట్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేరుగా వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
