AP | జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అప‌శ్రుతి.. కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి

గుంటూరు : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఏటూకురులో వైఎస్ జగన్ నేటి ఉద‌యం ప్రయాణిస్తున్న కాన్వాయ్ (Convoy).. ఒక వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

వివ‌రాల‌లోకి వెళితే… బుధవారం సత్తెనపల్లి (Sattenapalli) మండలం రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అందుకోసం ఆయన భారీ కాన్వాయ్‌తో రెంటపాళ్లకు తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) నుంచి బయలుదేరారు. ఆ క్రమంలో జాతీయ రహదారిపై ఏటూకురు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి.. 108కి సమాచారం అందించారు. దీంతో వారు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించారు.

Leave a Reply