Drowned | బాస‌ర‌లో విషాదం – మంత్రి పొన్నం దిగ్ర్భాంతి

హైదరాబాద్ – నిర్మల్ జిల్లా బాసర (Basra ) వద్ద గోదావరి (Godavari ) నదిలో స్నానం చేస్తూ ఐదుగురు యువకుల (five young ) మృతి చెందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar )తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ (dilsukhnagar ) కి ఓ చెందిన కుటుంబం బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి ఈరోజు ఉదయం గోదావరి లో స్నానానికి వెళ్ళి ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందారని సమాచారం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల వద్దకు నదుల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఇటీవల జనవరి లో కొండపోచమ్మ సాగర్ లో ఐదుగురు యువకులు , వారం రోజుల క్రితం మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పడి ఆరుగురు యువకులు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను నదులు ,కాలువలు ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ ల ,కాలువల వద్ద లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి మంచి భవిష్యత్ కలిగిన యువకులు ఇలా చనిపోవడం బాధాకరమని వారి కుటుంబానికి దైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని వేడుకున్నారు. బాసర గోదావరి నదిలో మృతి చెందిన ఐదుగురు యువకులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *