చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ లో రాణించిన ఆర్సీబీ.. ఇప్పుడు బౌలింగ్ లోనూ మ్యాజిక్ చేస్తొంది. పవర్ ప్లేలో చెన్నై జట్టు వరుస షాకులిస్తూ చెలరేగుతొంది.
ఆర్పీబీ నిర్దేశించిన 197 పరుగుల ఛేదనలో సీఎస్కే మూడు వికెట్లు కోల్పోయింది. 4.4వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దీపక్ హుడా (4) పెవిలియన్ చేరాడు.
దీంతో 5 ఓవర్లకు 27 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ రచిన్ రవీంద్ర (17) తో పాటు సామ్ కర్రన్ ఉన్నాడు.