సీఆర్డీయే ఏసీ సుడిగాలి పర్యటన

అమరావతి పనులు స్పీడ్ పెరగాలని ఏపీ భార్గవ తేజ ఆదేశం
( ఆంధ్రప్రభ, అమరావతి ప్రతినిధి) : రాజధాని అమరావతిలో సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీల కోసం నిర్మిస్తున్న బంగ్లాల నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. పనుల్లో మరింత వేగం పెరగాలని ఆయన అక్కడి పర్యవేక్షకులను ఆదేశించారు.
