College | ఘ‌నంగా జాతీయ గణిత దినోత్సవం

College | ఘ‌నంగా జాతీయ గణిత దినోత్సవం

  • రామానుజన్ చిత్రపటానికి నివాళులు

College | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు రూరల్ మండలం నరసింగరాయనిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహానుభావుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధనంజయ ముఖ్య అతిథిగా పాల్గొని రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ధనంజయ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ తన జీవితాన్ని గణిత శాస్త్ర అభివృద్ధికి అంకితం చేసి ఎన్నో క్లిష్టమైన గణిత సూత్రాలను కనుగొని విశ్వానికి అందించిన అపూర్వ మేధావి అని కొనియాడారు. భారతదేశ గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, కృషి నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

College

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి శరశ్చంద్రశేఖర్ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రం ద్వారా భారతదేశ ప్రతిభను ప్రపంచానికి చాటిన కృషీవలుడని అన్నారు. విద్యార్థులు గణితాన్ని కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా ఒక పద్ధతిగా, ఒక నైపుణ్యంగా భావించి సులభంగా అర్థం చేసుకుని ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. గణితంపై భయాన్ని తొలగించి ఆసక్తితో నేర్చుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.

College

జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత రామానుజన్ అకాడమీ అవార్డు పొందిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధనుంజయను, అలాగే గణిత అధ్యాపకులు లక్ష్మణ్ రెడ్డిని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. వారి సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వినాయకం, మహేష్ రెడ్డి, శరశ్చంద్రశేఖర్‌తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

College

Leave a Reply