ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) బుధవారం (అక్టోబర్ 1న) రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (అక్టో ప్రజల సందర్శనార్థం నగరంలోని జూబ్లీహిల్స్ లోని దామోదర్ రెడ్డి నివాసంలో పార్థీవ దేహాన్ని ఉంచారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడకు చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
తీరని లోటు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. అంతకు ముందు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాళులు అర్పించారు.