CM | సౌర విద్యుదుత్పత్తితో ఆదాయం – ఆదివాసుల అభివృద్ధే ల‌క్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ , ఆంధ్ర‌ప్ర‌భ : సౌర విద్యుత్‌తో ఆదివాసులు ఆదాయం మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమ్రాబాద్ ఇందిర సౌర గిరి జల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు 5, 7.5 హెచ్‌పీ పంపుసెట్లు ఇస్తామన్నారు.

‘అచ్చంపేట’ను ఆదర్శంగా తీర్చిదద్దుతాం
అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని సీఎం ప్ర‌క‌టించారు. ఈ నియోజకవర్గంలో వంద రోజుల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ పంపుసెట్ల స్థానంలో వీటిని బిగిస్తారని, ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర విద్యుత్ ఉత్ప‌త్తి గిరిజనులు ఆదాయం పొందాలని సూచించారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

6.63 ల‌క్ష‌ల ఎక‌రాల పోటు ప‌ట్టాలు
రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.63 లక్షల ఎకరాల విస్తీర్ణానికి (2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు) పోడుపట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్తు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించి, జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే తదితర పనుల్ని గిరిజన సంక్షేమశాఖ చేపడుతుంది. జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు తదితర పనుల్ని పూర్తి చేస్తారు. తొలి ఏడాదికి 10 వేల మంది రైతులకు చెందిన 27.184 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు దాదాపు రూ.600 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

Leave a Reply