China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News

China Pakistan Call : కాల్పులు ఆపండి Andhra prabha News

  • శాంతికి చర్చలు జరపండి
  • ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్​ అత్యవసరం
  • నౌకలను వదలండి
  • మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణకు పాక్-చైనా పిలుపు
  • బీజింగ్‌లో దౌత్య చర్చలు
  • హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యం
  • నౌకల భద్రతపై ఆందోళన
  • ఇరాన్-గల్ఫ్ దేశాల సార్వభౌమత్వంపై సానుకూలత
  • మధ్యవర్తిగా పాకిస్తాన్ పాత్ర
  • కీలక మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని విజ్ఞప్తి
  • శాశ్వత శాంతికి ఐక్యరాజ్యసమితి పాత్ర

( ఆంధ్రప్రభ, బీజింగ్​ ప్రతినిధి)

China Pakistan Call : మధ్యప్రాచ్చంలో తక్షణ కాల్పుల విరమించి , శాంతికి చర్చలు జరపాలని చైనా, పాకిస్తాన్ జంట పిలుపుని ఇచ్చింది. బీజింగ్​ లో మంగవారం చైనా, పాకిస్థాన్​ దౌపాక్షిక చర్చలు జరిపాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మార్గం హోర్ముజ్ జలసంధి మీదుగా వాణిజ్య, పౌర నౌకల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని, ఆ జలమార్గంలో చిక్కుకున్న ‘నౌకలు సిబ్బంది భద్రతను కాపాడాలని’ ఈ జంట దేశాలు అన్ని పక్షాలను కోరాయి. “శత్రుత్వాలను తక్షణమే విరమించుకోవాలని, ఘర్షణ నిరోధానికి గరిష్ట ప్రయత్నాలు చేయాలని చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి.

China Pakistan Call : “ఇరాన్, గల్ఫ్ దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం భద్రతను పరిరక్షించాలి,” అని కోరారు. న్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, చైనా సహచరుడు వాంగ్ యీ మధ్య భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో మధ్యప్రాచ్యం అంతటా తీవ్రమవుతున్న సంఘర్షణపై చర్చించారు.

China Pakistan Call : ఈ వారాంతంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ తో కలిసి చతుర్ముఖ భేటీకి ఆతిథ్యం ఇవ్వాలని, అంతక ముందు, ఇరాన్ అమెరికా తో తమ స్నేహపూర్వక బంధాలను ఉపయోగించాలని , అమెరికా యొక్క 15-సూత్రాల ప్రణాళికను ఇరాన్​ కు అందించడంలో పాకిస్తాన్ ఒక కీలక మధ్యవర్తిగా అవతరించింది.

China Pakistan Call : ఈ తాజా దౌత్య ప్రయత్నంలో, పౌరులపై “ఇంధనం, డీశాలినేషన్, విద్యుత్ కేంద్రాలు, శాం తియుత అణు కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై” దాడులను తక్షణమే నిలిపివేయాలని పాక్​ చైనా జంట అన్ని పక్షాలకు కోరాయి. “శాశ్వత” శాంతి కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టాల ప్రాధాన్యతను నిలబెట్టాలని కూడా పాక్​, చైనా కోరాయి.

Leave a Reply