CHILD | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు దర్గామిట్టలోని జడ్పీ హైస్కూల్ నందు గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని జడ్పీ హైస్కూల్ దర్గా మిట్ట, నెల్లూరులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిక అధికారి బి. హేనా సుజన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నారులు సమాజానికి, దేశానికి విలువైన సంపద అని, భావి పౌరులైన వీరి భద్రత, సంరక్షణ, అభివృద్ధికి అందరమూ ప్రాధాన్యం ఇవ్వాలని, బాల్యం ఆనందంగా సాగేలా చర్యలు తీసుకోవడంతోపాటు పిల్లల్లో నేర్చుకోవాలన్నారు. ప్రభుత్వాలతో సహా ప్రతి ఒక్కరూ బాలల సంక్షేమానికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏటా నవంబరు 20న అంతర్జాతీయ బాలల హక్కుల నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడ ము వారికి ఉన్న హక్కుల గురించి సమాజానికి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు నేటికీ విద్య, ఆరోగ్యం, ఆనందమయ జీవితాన్ని పొందడంలో తమ హక్కులను కోల్పోతున్నట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) వెల్లడించింది. ముఖ్యంగా బాలికలు తమ హక్కులను పొందలేకపోతున్నారని పేర్కొంది. పిల్లలపై జరుగుతున్న అకృత్యాల గురించి అందరూ అవగాహన కలిగి వాటిని ఎదుర్కొనే లాగా తయారవ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ గారు మురళీధర్ మాట్లాడుతూ 1989 నవంబర్ 20వ తారీఖున ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు బాలల హక్కుల పైన సంతకం చేయడం జరిగిందని అప్పటినుంచి ప్రభుత్వాలు బాలలకు విద్య కనీస వసతులు కల్పిస్తూ తల్లికి వందనం మధ్యాహ్న భోజన పథకాలు పథకాల ద్వారా పిల్లల హక్కుల్ని కాపాడడంలో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిడి సోషల్ వెల్ఫేర్ శోభారాణి ,బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ టి మాధవి జిల్లా బాలల సంరక్షణ అధికారి బి సురేష్ లేబర్ డిపార్ట్మెంట్ నుండి వెంకటేశ్వర్లు ఏ ఎస్ ఐసతీష్ , డైరెక్టర్ శ్రీ ఐ. శ్రీనివాసరావు స్కూల్ హెడ్మాస్టర్ శ్రీకృష్ణారెడ్డి అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సంబంధించి సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో, ఐసిపిఎస్ సిబ్బంది మరియు స్కూల్ సిబ్బంది ,విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొనడం జరిగింది

