Basara | యువకుడిని కాపాడిన పెట్రోలింగ్ పోలీసులు

బాసర, మే 1 (ఆంధ్రప్రభ) : బాసర గోదావరి బ్రిడ్జి పై గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై సంజివ్ తెలిపిన వివరాల మేరకు.. బైంసా మండలం అంబలి గ్రామానికి చెందిన తమ్మోళ్ల సాయినాథ్ తన తండ్రి మందలించాడని జివితంపై విరక్తి చెంది గోదావరి బ్రిడ్జిపై నుండి దూకేందుకు ప్రయత్నించగా.. బ్రిడ్జిపై పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న మోహన్ సింగ్, దినేష్, లింగన్న, యువకుడిని కాపాడారు.

సాయినాథ్ కు ధైర్యం చెప్పి తండ్రికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు యువకుడ్ని అప్పగించారు. కుటుంబంలో సమస్యలున్నవారు కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని ఎస్సై సంజీవ్ సూచించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలను బలి తీసుకుంటాయన్నారు. యువకుడిని కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్, హోంగార్డు దినేష్, లింగన్నలను స్థానికులు, భక్తులు అభినందించారు.

Leave a Reply