AP | ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్

వెలగపూడి – డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఎపి సర్కార్‌. . ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ఉత్తర్వులు జారీ చేశారు

ముందస్తు అనుమతులు లేకుండా పలు సార్లు విదేశీ యాత్రలు చేసినట్టు అభియోగం డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పైన ఉంది.

సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లిన సమయంలో ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, మరికొన్ని పర్యటనలకు అనుమతి తీసుకున్నప్పటికీ.. ట్రావెల్ ఫ్లాన్‌కు విరుద్ధంగా సునీల్ విదేశాల్లో ఉండడం.. అక్కడ ప్రయాణించడం జరిగిందనే ఆరోపనలు వచ్చిప నేపథ్యంలో ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. విచారణ జరిపిన ఆ అధికారి ఇచ్చిన నివేధిక ఆధారంగా ప్రభుత్వం సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది

అఖిలభారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు సునీల్ పై ఛార్జ్ కూడా నమోదు అయింది. ఈ తరుణంలోనే డిజిపి ర్యాంకు లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఊహించని షాక్‌ ఇస్తూ సస్పెన్షన్ వేసింది సర్కార్‌.

ఇది ఇలాఉంటే, సునీల్ కుమార్‌పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నరసాపురం ఎంపీ, ప్రసుత్త ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కూడా ధృవీకరించింది.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *